మళ్ళీ భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే మనదేశంలో 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు.
సోమవారంతో పోల్చి చూస్తే, మంగళవారం 40% కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1,881 కేసులు పెరిగాయి. దీంతో మూడు నెలల తర్వాత యావరేజ్ గా రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటింది. ఈక్రమంలో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం కేసుల సంఖ్య ఇలా ఉంది.
- ప్రస్తుతం ఇండియాలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య – 28,857
- యాక్టివ్ కేసులు – 0.06%
- గత 24 గంటల్లో కోలుకున్నవారు – 3,345 మంది
- మొత్తం రికవరీ రేటు – 98.72%
- దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య – 4,31,90,282
- ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య – 4,26,36,710
- దేశంలో మరణాల సంఖ్య – 5,24,715
- రోజువారీ పాజిటివిటీ రేటు – 1.67%
- వీక్లీ పాజిటివిటీ రేటు – 1.12%
COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 194.43 కోట్ల డోసులను పంపిణీ చేయటం జరిగింది. నిన్న 14,94,086 మందికి టీకాలు ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం… జూన్ 7 వరకు దేశ వ్యాప్తంగా 85,35,22,623 నమూనాలను పరీక్షించారు. మంగళవారం ఒక్కరోజే 3,13,361 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా విజ్రుంభిస్తుంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే వస్తున్నాయి.